Thursday, May 16, 2024

ఈవిఎం గోదాంను ప్రారంభించిన శ‌శాంక్ గోయ‌ల్..

పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన నూతన ఈవిఎం గోదాంను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్.శశాంక్ గోయల్ గురువారం ప్రారంభించారు. జిల్లాలో ఈవిఎం గోదాం ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పెద్దపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఈవిఎంలను భద్రపరిచేందుకు నిర్మించిన ఈవిఎం, వివిప్యాట్ గోదాంను ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,డి. సి. పి. రవీందర్, పెద్ద పల్లి తహసిల్దార్ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ తూము రవీందర్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్,ఆర్. అండ్ బి అధికారులు, సంబంధించిన అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement