Sunday, April 28, 2024

UP : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు ప్ర‌మాదం… న‌లుగురు మృతి

ఉత్తర ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్ జిల్లాలోని ఆగ్ర-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వేపై మంగళవారం తెల్లవారుజూమున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడిక్కకడే మృతి చెందారు. మరో 21 మంది ప్యాసింజర్లు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఓవర్ స్పీడా లేక డ్రైవర్ నిద్ర మత్తు వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరగడంతో ఆగ్ర-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement