Sunday, May 5, 2024

Breaking | రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్​లోనే ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మాడ్గుల మండలం చంద్రయానపల్లి వద్ద ఇవ్వాల (సోమవారం) సాయంత్రం ఆటో-టాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుప్రతికి తరలించారు. మృతులను మాడ్గుల మండలానికి చెందిన సత్యనాయక్‌, శాంతి, అభి (7)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement