Thursday, May 16, 2024

ఆ దారుణాన్ని నమ్మలేకపోతున్నా: రామ్ గోపాల్ వర్మ

మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిపల్వ గ్రామానికి చెందిన  ఇద్దరు యువతులకు కొందరు వ్యక్తులు కర్రలతో దారుణంగా కొట్టారు. అక్కాచెల్లెళ్లు తమ మేనమామ కుమారులతో కొంత కాలంగా ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఇద్దరినీ చితకబాదారు. వారిని కాళ్లతో తంతూ, కర్రలతో కొడుతూ దారుణంగా హింసించారు. యవతి కింద పడిపోయిన పట్టించుకోకుండా మానవత్వం మరించి ప్రవర్తించారు. జుట్టు పట్టుకుని ఇద్దరినీ ఈడుస్తూ, కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన గత నెల 22న దాడి జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ దారుణాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష విధించాలని… లేకపోతే ఈ దేశంపై తనకు ఉన్న నమ్మకమే పోతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement