Friday, May 3, 2024

సీఎం జగన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అనిల్ కుంబ్లే..

ఏపీ సీఎం జగన్ ను భారత్ దిగ్గజ స్పిన్ బౌలర్, మాజీ టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ తో కరచాలనం చేసిన కుంబ్లే… ఆయనకు పుష్పగుచ్ఛాన్ని, జ్ఞాపికను అందించారు. మర్యాదపూర్వకంగానే జగన్ ను టీమిండియా మాజీ కెప్టెన్ కుంబ్లే కలిసినట్టు వైసీపీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: శివసేన, బీజేపీ మళ్లీ కలిసే అవకాశం ఉందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement