Wednesday, May 15, 2024

షిరిడీ సాయి స‌న్నిధిలో రాజ్‌నాథ్‌, ఎక్‌నాథ్ షిండే.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అధికారులు

షిర్డీ (ప్రభన్యూస్): కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షిరిడీ సాయిబాబా సమాధి ఆలయాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి ద్వారకామాయి, గురుస్థాన్‌లను సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, దేవాదాయ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, జిల్లా సంరక్షక శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాసిక్‌ డివిజనల్‌ కమిషనర్‌ రాధాకృష్ణ గేమ్‌, జిల్లా కలెక్టర్‌ సిద్ధరామ్‌ సలీమత్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆశిష్‌ యెరేకర్‌, శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. శివశంకర్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాకేష్ ఓలా పాల్గొన్నారు.

సాయిబాబా ఆలయానికి చేరుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీ సాయిబాబా సమాధిని దర్శించుకుని పాద్యపూజ, హారతి నిర్వహించారు. సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేలకు సాయిబాబా విగ్రహాన్ని బహూకరించి శివశంకర్‌ సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement