Thursday, May 16, 2024

మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉపఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో ఈరోజు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బంగారుగడ్డ నుంచి చండూరు సెంటర్ వరకు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే భారీ ర్యాలీగా చేరుకున్న రాజగోపాల్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ నేత‌లు త‌రుణ్ చుగ్, బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement