Monday, April 29, 2024

కారెక్కిన కార్పొరేటర్… మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిక

వరంగల్ కార్పొరేషన్ : గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ మామిళ్ల రాజు కారెక్కారు. సోమవారం ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు, రాష్ట్ర ఎక్సైజ్ స్పోర్ట్స్ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ ల సమక్షంలో, ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ల ఆధ్వర్యంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి కార్పొరేటర్ ను తెరాస పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేటర్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు అనుచరులు సుమారు మూడు వందల ప్రగతి భవన్ కు చేరుకొని గులాబీ కండువా కప్పుకున్నారు.

డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజు మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ ను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే తెరాస పార్టీలో చేరిక కావడం జరిగిందని గ్రేటర్ లోనే ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్, కూడా అడ్వైసరి మెంబర్ మాడిశెట్టి శివశంకర్, మాజీ కార్పొరేటర్లు వేల్పుల మోహన్ రావు, మాడిశెట్టి అరుణ తో పాటు అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో డివిజన్ అభివృద్ధికి పాటు పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కూడా అడ్వైసరి మెంబర్ మాడిశెట్టి శివ శంకర్, తెరాస డివిజన్ అధ్యక్షులు వెంకన్న, తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement