Monday, May 6, 2024

రంగ‌మార్తాండ నుండి లిరిక‌ల్ సాంగ్.. స్వ‌యంగా ఆల‌పించిన ఇళ‌య‌రాజా

ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న చిత్రం రంగ‌మార్తాడ.కొంతకాలం క్రితం మరాఠీలో వచ్చిన ‘నట సామ్రాట్’ సినిమాకి ఇది రీమేక్. ఒక రంగస్థల కళాకారుడి జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. పువ్వై విరిసే ప్రాణం .. పండై మురిసే ప్రాయం .. రెండూ ఒకటే నాణానికి .. బొమ్మాబొరుసంతే..’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించారు. ఇళయరాజా స్వరపరచడమే కాకుండా, స్వయంగా ఆలపించారు. ఒక పాత్ర ముగిసింది నేడు .. ఇంకెన్ని మిగిలాయో చూడు, నడిపేది పైనున్న వాడు .. నటుడేగా నరుడన్నవాడు’ వంటి లైన్స్ ఈ పాటకి హైలైట్. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement