Monday, April 29, 2024

మ్యాక్సీ వ్యాన్ బోల్తా – 20 మందికి గాయాలు…

తిరుపతి జిల్లా… రామచంద్రాపురం మండలం అనుపల్లి గ్రామం నుండి మ్యాక్సీ వ్యాన్లు సుమారు 40 మంది ప్రయాణికులను తరలిస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. అతివేగంగా ప్ర‌యాణించ‌డం వ‌ల్లే అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి గురైంది.. ఈ ప్ర‌మాదంలో 20 మంది ప్ర‌యాణీకులు గాయ‌ప‌డ్డారు.. వారిలో అయిదుగురు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో చంద్రగిరి. ఏరియా హాస్పిటల్. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమందిని చవట గుంటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులు అందరూ అనుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులే..అనుపల్లి గ్రామం నుండి బ్రాహ్మణపల్లి పంచాయతీ కమ్మ కండ్రిగ గ్రామంలో జరిగే దహన క్రియల కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. వెదురుకుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement