Friday, May 3, 2024

Breaking: చెన్నైలో భూ ప్రకంపనలు

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి కదిలిపోతున్న ఫీలింగ్‌తో.. స్థానికులంతా భయాందోళన చెందారు. ఇళ్లలోని పాత్రలన్నీ షేకవుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక బయటకు పరుగులు తీశారు. రెండు నుంచి మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అన్నాసాలైలోని నివాసాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో నివాసితులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. అకస్మాత్తుగా భూకంపం సంభవించింది. చెన్నైలోని రాయపేటలోని లాయిడ్స్ రోడ్డు సమీపంలో భూకంపం సంభవించినట్లు సమాచారం. అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు అపార్ట్ మెంట్ భవనం నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement