Thursday, April 25, 2024

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రగతి దిశగా పల్లెలు : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 22 (ప్రభన్యూస్‌): బీఆర్‌ఎస్‌ పాలనలో పల్లెలన్నీ అన్ని రంగాల్లో ప్రగతి దిశగా పయనిస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్‌ మండలం కందునూరిపల్లి గ్రామంలో ఎంజీ ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ నిధుల ద్వారా 20 లక్షలతో గ్రామపంచాయితీ భవన నిర్మాణానికి భూమి పూజ, 7 లక్షల రూపాయలు, ఎస్‌డీఎఫ్‌ ద్వారా రూ. 10 లక్షలతో పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ సౌకర్యాల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీసీ రోడ్లతోపాటు మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేంచందర్‌రావు, సర్పంచ్‌ పన్నాల స్వరూప తిరుపతి, ఎంపీటీసీ సంపత్‌, ఉపసర్పంచ్‌ పద్మ కొమురయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ష్మీ రాజం, చొప్పరి అంజన్న, నర్సమ్మ, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement