Saturday, April 27, 2024

ప్రజా ఫిర్యాదులకు వేగంగా పరిష్కారం చూపాలి.. : కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి, ప్రభన్యూస్ : ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ చాంబర్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో పరిష్కరించాలని ఆయన అన్నారు.

ప్రజావాణి లో భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు, వినతుల పై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణి కి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. కాగా సోమవారం ప్రజావాణి లో మొత్తం 27 ఫిర్యాదులు, వినతులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement