Thursday, May 16, 2024

పృథ్వీ షా రీ ఎంట్రీ..

ముంబై : ఢిల్లి క్యాపిటల్స్‌కు గుడ్‌ న్యూస్‌.. జట్టు ఓపెనర్‌, చిచ్చర పిడుగు పృథ్వీ షా అందుబాటులోకి రానున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లి క్యాపిటల్‌ ఒక రకంగా శుభవార్తే అని చెప్పుకోవాలి. గత కొన్ని మ్యా చులకు షా దూరం అయ్యాడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లి తరఫున ఓపెనింగ్‌ చేసేందుకు పృథ్వీ షా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

ఈ ఏడాది సీజన్‌లో పృథ్వీ షా ఓపెనర్‌గా ఢిల్లి తరఫున ఎంతో బాగా రాణించాడు. షా గత మూడు మ్యాచులు దూరం కావడంతో.. ఢిల్లికి సరైన ఓపెనింగ్‌ లభించలేదు. అతడి స్థానంలో శ్రీకర్‌ భరత్‌ తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ సీజన్‌ లో పృథ్వీ షా 9 మ్యాచుల్లో రెండు అర్ధ సెంచరీలతో.. 259 పరుగులు బాదాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement