Saturday, May 18, 2024

రౌడీ బోయ్​తో పూజా హెగ్డే రొమాన్స్‌..

బాలీవుడ్‌ నుండి వచ్చి టాలీవుడ్‌లో పాగావేసింది నటి పూజా హెగ్డే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో సైతం నటిస్తోంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఫస్ట్​ ప్లేస్​లో ఉంది ఈ భామా. ఇటీవలే ఆమె నటించిన రాధేశ్యామ్‌, బీస్ట్‌ (తమిళ్‌), ఆచార్య చిత్రాలు విడుదలయ్యాయి. ఇకపోతే పూజా కొత్తగా మరో సినిమా కమిటైనట్టు తెలిసింది. యంగ్‌ టాలెంట్‌ విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాలో పూజాను ఎంపికచేసినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

లైగర్‌ తర్వాత విజయ్‌, పూరీ కాంబినేషన్‌లో జనగణమన సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. లాంఛనంగా ప్రారంభించారు కూడా. ఛార్మి, వంశీ పైడిపల్లి, పూరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన పూజా హెగ్డేను ఎంపికచేసినట్టు తెలిసింది. జూలై నుండి ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని, పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కనున్నట్టు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement