Saturday, April 27, 2024

Delhi: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ – చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు.


ఈ సందర్భంగా మెట్రో ప్రయాణం గురించిన వివరాలను రాష్ట్రపతికి వికాస్‌ కుమార్‌ వివరించారు. ఆమె కొందరు అధికారులతో కలసి ఖాళీ బోగీలో ప్రయాణిస్తున్న 27 సెకన్ల వీడియో నెట్లో వైరల్ అవుతోంది. అయితే రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణించారు, ఎందుకు ప్రయాణించారు వంటి వివరాలు మాత్రం తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement