Monday, April 29, 2024

AP: రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం

క‌ర్నూల్‌జిల్లా, ప్ర‌భ‌న్యూస్‌: రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందిన సంఘటన బుధవారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకడబూరు మండలంలోని, హనుమాపురం నలంద డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న తల్లి కూతుర్లను కారు ఢీకొంది.

ఘటనలో హనుమాపురానికి చెందిన జయలక్ష్మీ(37), అక్షర (5) అనే తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. తల్లి కూతుర్లు తమ పొలానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదోని నుంచి ఎమ్మిగనూరు వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొంది. దీంతో హనుమాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement