Sunday, May 12, 2024

TS | పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ వాయిదా..

హైదరాబాద్‌: తెలంగాణలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పాలిసెట్‌) వాయిదా పడింది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది. మే 17న పాలిసెట్‌ జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు గత నెలలో పాలిసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది.

ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌) సీట్లను పాలిసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 24వరకు, 300 ఆస్య రుసుంతో ఏప్రిల్‌ 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement