Tuesday, May 14, 2024

నిరుపేద విద్యార్థి సన్నీని – డాక్టర్ చదివేందుకు – ఎంపీ రంజిత్ రెడ్డి ఆర్థిక చేయూత

మెడికల్ సీట్ సాధించినప్పటికీ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యవిద్య చదివేందుకు దాతల కోసం ఎదురుచూస్తున్న హుస్నాబాద్ కి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుమారుడు.. బోనగిరి సన్నీకి ఆర్థిక సహాయం అందజేసారు ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి. సన్నిని వారి తల్లిదండ్రులను ఇంటికి పిలిచి అభినందించారు. డాక్టర్ కోర్సు పూర్తి అయ్యే వరకు నా వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బాగా చదువుకొని పేదలకు వైద్య సేవలు అందిచాలని ఎంపీ రంజిత్ రెడ్డి సూచించారు. ఎంపీ ఆర్థిక సహాయం చేయడంతో పేద కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement