Monday, May 6, 2024

Good News: రెండు వేల దిగువన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి భారీగా తగ్గింది. రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా బులిటెన్ ప్రకారం.. దేశంలో కొత్తగా 1761 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన తర్వాత రెండు వేలలోపు రోజువారీ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,30,07,841కి పెరిగింది. ఇందులో 4,24,65,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

గత 24 గంటల్లో 127 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,16,479కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 26,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3196 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement