Monday, May 13, 2024

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ : 99.51 శాతం నమోదు

పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పోలింగ్ లో 208 మంది ఓటర్లకు గాను, 207 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రంగాపూర్ ఎంపీటీసీ కల బోయిన మహేందర్ తన ఓటు హక్కును వినియోగించు కోలేదు. 99.51 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లతోపాటు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement