Thursday, May 2, 2024

ప్రకాశం జిల్లాలో ఒమిక్రాన్ కలవరం..?


అమెరికా నుంచి ప్రకాశం జిల్లా కావలికి వచ్చిన ఇద్దరు ప్రముఖ వైద్యులకు కరోనా పాజిటివ్ గా నిద్దారణ అయ్యింది. వారు రాత్రి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేటు హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే వారి నుంచి రక్త నమూనాలు సేక‌రించి పూణే ల్యాబ్ కు పంపిచినట్లు సమాచారం.. రెండు రోజుల్లో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పరిక్షల వివరాలు నిర్దారణ కానున్నాయి. జిల్లా కలెక్టర్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వారు నిర్వహించే ప్రైవేటు హాస్పిటల్ సిబ్బందికి వైద్య సిబ్బంది టెస్టులు నిర్వహించారు. అలాగే మ‌రికొంద‌రు కూడా ఇటీవ‌లే అమెరికా నుంచి కావ‌లికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వాంద‌రినీ గుర్తించే ప‌నిలో అధికారులుండ‌గా.. అది క‌రోనా నేనా.. లేదా ఒమిక్రానా అని స్థానికులు మాత్రం ఆందోళనలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement