Monday, May 6, 2024

TS : 16 నుంచి తెలంగాణ‌లో మోడీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది.

- Advertisement -

అయితే, తేదీలను సూత్రప్రాయంగా ఖరారు చేసినట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యనేతలతో చర్చించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి త్వరలో ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement