Saturday, April 27, 2024

నల్లధనం వెలికితీతకు ఢిల్లీ హైకోర్టులో పిల్..

దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్న‌ట్టు ప్రభుత్వాన్ని ఆదేశించా లనీ,నల్లకుబేరుల ఆస్తులన్నింటినీ జప్తు చేయాలనీ, దోషులుగా నిర్ధారణ అయినవారికి యావజ్జీవ ఖైదువిధించ ాలని కోరుతూ ఢిల్లిd హైకోర్టులో మంగళవారం నాడు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.అలాగే, మనుషులను అక్రమంగా రవాణా చేసేవారికి కూడా క ఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

బినామీ ఆస్తులు కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకో వాలనీ,బినామీ ఆస్తులనుస్వాధీనం చేసుకోవాలని పిటిషనర్‌ కోరారు.నల్ల ధనం వల్ల దేశంలో అవాంఛనీయ మనకార్యకలాపాలు బాగా పెరిగిపోతు న్నాయ నీ,వాటినిఅరికట్టేందుకు నల్లధనాన్ని నూరు శాతం స్వాధీనం చేసుకోవాలని పిటిషనర్‌ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement