Thursday, May 23, 2024

తెలంగాణ‌లో ప్రారంభమైన పీజీ దంత (డెంటల్)ప్రవేశాల ప్రక్రియ.. 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ఎండీఎస్‌ సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్‌ కోట సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయస్థాయి అర్హత పరీక్షా నీట్‌ ఎండీఎస్‌ 2022లో అర్హత సాధించిన అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 25న ఉదయం 8 గంటల నుంచి 31వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్ణీత దరఖాస్తు పూరించి సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సమర్పించి న దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూని వర్సిటీ పరిశీలించి అనంతరం అర్హుల తుది జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది.

దరఖాస్తులను http://tsmds.tsche.in వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించి సాంకేతిక సమస్యలకు 9392685856, 7842542216, 9059672216 నెంబర్లకు, నిబంధనలు తెలుసుకోవాలంటే 9490585796, 850064769 నెంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఫోన్‌ చేయవచ్చు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ WWW.KNRUHS.Telangana.Gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement