Tuesday, July 23, 2024

AP : అప్ప‌న్న‌కు రెండో విడ‌త చంద‌న స‌మ‌ర్ప‌ణ‌

వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అప్పన్న స్వామికి రెండో విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

- Advertisement -

అర్చకులు వేకువజామున రెండు గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత సేవలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసుకుని ఉంచిన శ్రీ గ్రంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అడివివరంలోని వరాహ పుష్కరిణి చెరువు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement