Thursday, May 23, 2024

Breaking : పెనమలూరు ఎమ్మెల్యే కేపీ పార్థ‌సారధికి పితృవియోగం

పెనమలూరు ఎమ్మెల్యే కేపీ పార్థ‌సారధి తండ్రి, మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు కెపి రెడ్డయ్య ఈరోజు తెల్లవారుజామున మృతిచెందారు. ఈయన ఒకసారి ఉయ్యూరు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. జడ్పీ చైర్మన్ పదవి కోసం తోట్లవల్లూరు మండలం నుంచి జ‌డ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని విజయవాడ పీడ‌బ్ల్యూడీ గ్రౌండ్ ఎదురుగా గల గృహం వద్ద ఉంచారు. ఈరోజు సాయంత్రం స్వగ్రామం మొవ్వ మండలం కారకంపాడుకు తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement