Saturday, April 27, 2024

Prakasham : లంచంతో ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ పంచాయతీ సెక్ర‌ట‌రీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం ల‌క్క‌వ‌రంలో ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. లక్కవరం సచివాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ సుజాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement