Saturday, April 27, 2024

మ‌హారాష్ట్ర‌, ఢిల్లీలో ఒమిక్రాన్ అనుమానిత కేసులు

ఒమిక్రాన్ అనుమానిత కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మరో 40 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా మహారాష్ట్రలో 28 కేసుల‌ను గుర్తించారు. నిన్న ఒక్కరోజే విదేశాల నుంచి 861 మంది ప్రయాణికులు వచ్చారని, వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని, 28 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అందులో 25 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులు కాగా, మరో ముగ్గురు వారి కాంటాక్ట్ లన్నారు. మహారాష్ట్రలో గుర్తించిన అనుమానిత కేసుల్లో 10 మంది ముంబైకి చెందిన వారేనని అధికారులు అంటున్నారు. అలాగే ఢిల్లీలో 12 అనుమానిత కేసులను గుర్తించారు. వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. నిన్న 8 మంది అనుమానితులను ఆసుపత్రిలో చేర్చగా.. ఇవాళ మరో నలుగురిని తరలించామని అధికారులు చెబుతున్నారు. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. అనుమానితుల‌ను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement