Thursday, May 2, 2024

బ్యాంకుల ప్రైవేటీకరణపై స్పందించిన నిర్మలా సీతారామన్

దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడంలేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఆర్థిక మంత్రి స్పందించారు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడంలేదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరించే బ్యాంకుల ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత భద్రత కల్పిస్తామని వెల్లడించారు. ఆయా బ్యాంకులను మూసివేయడం జరగదని, ఉద్యోగులను తొలగించబోవడంలేదని వివరించారు. ఆ బ్యాంకుల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటామని నిర్మల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement