Wednesday, May 8, 2024

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌.. గుజరాత్‌లో తొలి కేసు నమోదు

చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్‌కు చెందిన ఓ కొత్త వేరియంట్‌ను దేశంలో గుర్తించారు. దీన్ని కొవిడ్‌ ఎక్స్‌ బీబీ 1.5 వేరియంట్‌గా పిలుస్తున్నారు. గుజరాత్‌లో నమోదైన ఓ కేసులో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. అమెరికా వైద్య నిపుణులు కొవిడ్‌ ఎక్స్‌ బీబీ 1.5 రకాన్ని సూపర్‌ వేరియంట్‌ అంటున్నారు. ఇది బీక్యూ.1 వేరియంట్‌ కంటే 120 రెట్లు అధికవేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

అమెరికాలో 40శాతం కరోనా కేసులకు కారణమిదేనని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ విడుదల చేసిన డేటా వెల్లడించింది. చైనాలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు, అంటు వ్యాధి గురించి చాలా మంద్రి ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ… చాలా మంది నిపుణులు రెట్టింపు సూపర్‌ వేరియంట్‌ కొవిడ్‌ ఎక్స్‌ బీబీ1.5 గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

చైనా సంతతి అమెరికా వైద్య నిపుణుడు ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌ దీనిపై స్పందిస్తూ, కొవిడ్‌ ఎక్స్‌ బీబీ 1.5 వేరియంట్‌ మానవ వ్యాధినిరోధక వ్యవస్థను ఏమార్చే సామర్థం గలదని హెచ్చరించారు. కాగా, ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించిన 17 రోజుల వ్యవధిలోనే ఇది చాలామందికి వ్యాపించింది. ఒకప్పుడు కరోనా వైరస్‌ను చైనా ఎలా దాచిపెట్టిందో, ఈ కొత్త వేరియంట్‌ను అమెరికా కూడా దాచిపెట్టిందని ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌ ఆరోపించారు. అమెరికాలో అక్టోబరులోనే ఇది వెలుగుచూసిందని, ఇప్పుడిది అమెరికా నగరాల్లో వేగంగా ప్రబలుతోందని వివరించారు. ఒమిక్రాన్‌తో పోల్చితే ఇది భిన్నంగా ఉన్నందున దీనిపై ప్రభుత్వానికి అవగా#హన లోపించిందని, ప్రజలను కూడా సరిగా ##హచ్చరించలేక పోయిందని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement