Saturday, April 27, 2024

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి గాయాలు

వికారాబాద్ డిసెంబర్ 31 ( ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద రెండు వాహనాలు ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఇవ్వాల (శనివారం) రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి రోడ్డు మార్గంలో.. ఆర్డీవో కార్యాలయం వద్ద రెండు ద్విచక్ర వాహన ఢీ కొనడంతో ఈ వానాలపై వేలుతున్న నలుగురు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులు వారిని హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హిస్పిటల్ కు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement