Thursday, May 9, 2024

Big Breaking | మహబుబాబాద్​ జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్రానైట్​ రాయి పడి నలుగురు మృతి

మహబుబాబాద్​ జిల్లాలో ఇవ్వాల రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్​ రాళ్లతో వెళ్తున్న లారీలోనుంచి పెద్ద గ్రానైట్​ రాయి ఆ పక్కనే వెళ్తున్న ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న వారిలో నలుగురు స్పాట్​లోనే చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోల 10 మందికి పైగా వెళ్తున్నట్టు సమాచారం. కురవి పోలీస్​ స్టేషన్​ సమీపంలో ఈ యాక్సిడెంట్​ జరిగినట్టు తెలుస్తోంది. మృతులు మంగోళి గూడానికి చెందిన వారిగా గుర్తింపు.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement