స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ రియల్మీ కొత్త ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. రియల్మీ నార్జో 60 సిరీస్లో 60ఎక్స్ పేరిట కొత్త 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. 50 ఎంపీ కెమెరా, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సదుపాయాలున్నాయి. దీంతో పాటు రియల్మీ టి-300 పేరిట టీడబ్ల్యూఎస్ బడ్స్ను కూడా లాంచ్ చేసింది. రియల్మీ నార్జో 60ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ 4జీబీ, 128జీబీ వేరియంట్లలో లభిస్తుంది.
వీటి ధరలు వరుసగా రూ.12,999, రూ.14,499గా పేర్కొంది. ప్రారంభ ఆఫర్ కింద వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. సెప్టెంబర్ 15 నుంచి సేల్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 12న సేల్ నిర్వహించనున్నారు.నెబులా పర్పుల్, స్టెల్లర్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి. 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ దీని ప్రత్యేకం. వర్చువల్ ర్యామ్ సదుపాయం ద్వారా 12 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, సెల్ఫీల కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా వినియోగించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. రియల్మీ 60 ఎక్స్తో పాటు రియల్మీ టీ300 పేరిట ఇయర్బడ్స్ను సైతం లాంచ్ చేసింది. ఇందులో 2.4 ఎంఎం డైనమిక్ బేస్ డ్రైవర్, 30డిడబ్ల్యు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తోంది. 4 మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం కూడా ఉంది. దీని ధరను రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది.