Monday, May 13, 2024

ఏపీ హెచ్‌ఆర్సీకి కొత్త ఛైర్మన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి నియమితులయ్యారు. సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం, న్యాయవాది శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. గెజిట్ నోటిఫికేషన్‌లో వీరి నియామకాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లపాటు వీరు పదవిలో కొనసాగుతారని వాటిలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement