చినజీయర్ స్వామి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు చినజీయర్ స్వామి మంగళవారంవేయించుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న యశోదా ఆస్పత్రిలో చినజీయర్ స్వామికి టీకా వేశారు. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవార్టిన్ వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని స్వామీజీ చెప్పారు.అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు చినజీయర్ పై సెటైర్లు వెయ్యటం మొదలు పెట్టారు.
జనులారా కరోనా పోవాలంటే మీరు యజ్ఞాలు, యాగాలు దేవుడినే నమ్ముకోవాలి అన్నావు… నువ్వు మాత్రం వ్యాక్సిన్ నే నమ్ముకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.