Thursday, May 2, 2024

జోగిని శ్యామలపై FIR కేసు నమోదు

జోగిని శ్యామలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో FIR కేసు నమోదైంది. ఈనెల 12న మెదక్ జిల్లా ఏడుపాయల జాతరలో తనపై దాడి చేసి బట్టలు విప్పి ఫొటోలు, వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తుందని శ్యామలపై స్రవంతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసును మెదక్ జిల్లా పాపన్నపేట PSకు బదలాయించారు. దీనిపై జోగిని శ్యామల స్పందించింది. తాగి వచ్చి స్రవంతి జాతరలో గొడవ సృష్టించిందని.. వీడియోలో పోలీసులపై స్రవంతి దాడి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. తన ఎదుగుదల చూసి, పరువు తీయడానికి ఇవన్నీ చేస్తున్నారని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పోలీసులు కేసు నమోదు చేయడంతో జోగిన శ్యామలను వారు విచారించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement