Thursday, May 2, 2024

Nalgonda – వాట‌ర్ ట్యాంక‌ర్ తో ఆర్టీసీ బ‌స్సు ఢీ – 25 మందికి గాయాలు……

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామశివారులో జాతీయ రహదారి పై ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను అతివేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 25 మందికి గాయాల‌య్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement