Sunday, May 5, 2024

సాగర్ సమరం…. బీజేపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార టిఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా బిజెపి కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. అయితే ఎవ్వరూ అనుకోని విధంగా డాక్టర్ పనుగోతు రవికుమార్ పేరును బిజెపి అధిష్టానం ప్రకటించింది. నిజానికి మొదట అందరూ కంకణాల నివేదిక లేదా కడారి అంజయ్య యాదవ్ పేర్లను ప్రకటిస్తారని భావించారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ రవికుమార్ పేరును బిజెపి ప్రకటించింది.

అయితే రవి కుమార్ ను ఎంపిక చేయడం పట్ల కారణాలు చాలా ఉన్నాయట. నియోజకవర్గంలో 43 వేలకు పైగా రవికుమార్ సామాజిక వర్గానికి చెందిన లంబాడి లే ఉన్నారట. ఇక ఎంబిబిఎస్ చదివిన రవికుమార్ ప్రభుత్వ వైద్యుడిగా కూడా పనిచేసి ఇటీవలే రాజీనామా చేశారు. నిర్మల ఫౌండేషన్ ఛైర్మన్ గా వ్యవహరిస్తూ పలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement