Friday, May 24, 2024

ఏడుస్తూ ఓట్లు అడుగుతున్న బీజేపీ అభ్యర్థి

తెలంగాణలో మరో రెండు వారాల్లో జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ మేరకు బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన ఏడుస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఓట్లు అడగడం గమనార్హం. సాగర్ ఉపఎన్నికలో తనకు ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని ప్రజలను వేడుకున్నారు. కాగా రవి నాయక్ ఏడుస్తూ ప్రచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌ఛల్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement