Saturday, April 27, 2024

సైలెంట్ గా కొత్త ఇంటిలోకి మారిన నాగ‌చైత‌న్య‌

హీరో నాగ‌చైత‌న్య య తన అభిరుచుకి తగ్గట్లుగా కొత్త ఇల్లు నిర్మించుకుని అందులోకి రీసెంట్ గా గృహప్రవేశం చేసినట్లు ఫిలిం నగర్ లో టాక్. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే అంత హడావిడి, ఆర్భాటం లేకుండా సింపుల్ గా చైతు తన కొత్త ఇంట్లోకి ప్రవేశించార‌ట. నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత ఒక కొత్త ఫ్లాట్ ని కొనుగోలు చేశారు. సీనియర్ నటుడు మురళి మోహన్ కి చెందిన ప్రాపర్టీనే అది. ఈ విషయాన్ని మురళి మోహన్ గతంలో స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్ముదామని అనుకుంటున్న సమయంలో నాగ చైతన్య, సమంత వచ్చి అడిగారని.. దీనితో కాదనలేక వారికే ఆ ఇల్లు ఇచ్చినట్లు మురళి మోహన్ తెలిపారు. కొంతకాలం సమంత, నాగ చైతన్య ఆ ఇంట్లోనే కాపురం చేశారు.

ఆ తర్వాత విభేదాలతో చైతు విడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ఆ ఫ్లాట్ ని చైతు ..సమంతకి విడిచిపెట్టి నాగార్జున ఇంట్లోకి వెళ్ళాడట. అయితే చైతు ఎప్పటి నుంచో తన అభిరుచికి తగ్గట్లుగా మోడ్రన్ గా ఉండే మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకునేవాడట. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఒక స్థలం కొని చకచకా ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడట చైతు. స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ ఉండే విలాసవంతమైన ఇంటిని రెడీ చేసుకున్నాడు. ఇటీవల చైతు ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. తన సామాను మొత్తం మార్చేసుకున్నాడట. ఇక నుంచి చైతు అక్కడే ఉండబోతున్నట్లు టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement