Sunday, April 28, 2024

మూడుభాగాలుగా.. మ‌ల్టీస్టార‌ర్ మూవీ

సూప‌ర్ మ‌ల్టీస్టార‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హీరోలు బాల‌కృష్ణ‌..శివ‌రాజ్ కుమార్ లు న‌టించ‌నున్నార‌ని వార్త‌లు రాగా ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంద‌ని తెలిపారు. కానీ రీసెంట్ గా ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ మూడు భాగాలుగా రానుంద‌ట‌.ఈ చిత్రాన్ని క‌న్న‌డ స్టార్ శివరాజ్‌ కుమార్‌ తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మించ‌బోతున్నారు.ఈ సినిమాకి కన్నడ డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఆ డైరెక్టర్‌ ఎవరో తేలిపోయింది. శివరాజ్‌కుమార్‌తో వేద సినిమాని రూపొందించిన హర్ష దర్శకత్వం వహిస్తారట. అంతకు ముందు ఆయన బజరంగీ సినిమాని రూపొందించారు. ఈ రెండు బంపర్‌ హిట్లు అయ్యాయి. తాజాగా సౌత్‌ బిగ్గెస్ట్ స్టార్లతో కలిసి ఓ భారీ పాన్‌ ఇండియా మూవీ చేయబోతున్నారట. త్వరలోనే ఇది పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే దర్శకుడు వివరాలే కాదు, మరో క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమా రెండు పార్ట్ లు కాదు, మూడు పార్ట్ లుగా రాబోతుందట. మొదటి పార్ట్ లో హీరో బాలకృష్ణ, శివరాజ్‌కుమార్‌ నటిస్తారట. రెండో పార్ట్ లో బాలకృష్ణ, రజనీ కాంత్‌ నటిస్తారని తెలుస్తుంది. అటు రజనీకాంత్‌ కూడా దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే టాక్‌ వినిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య, రజనీకాంత్ , శివన్న వంటి ముగ్గురు మాస్‌ హీరోలు కలిసి సినిమా అంటే దానిపై అంచనాలకే ఆకాశమే హద్దు కాబోతుంది. ఇక మూడో భాగంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కూడా నటిస్తున్నారట. మూడో భాగంలో బాలయ్యగానీ, రజనీ, శివన్నగానీ కనిపించరని, పూర్తిగా కొత్త స్టార్స్ కమల్‌, మోహన్‌లాల్ కలిసి నటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సౌత్‌లో సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్ట్ సంచలనాత్మక ప్రాజెక్ట్ గా నిలుస్తుంది మరి ఇందులో నిజమెంతా కార్యరూపం దాల్చేవరకు ఎలాంటి మార్పులుంటాయనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement