Monday, May 6, 2024

ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ఎంపీ సోయం బాపూరావు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు పలుకుతూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు శుక్రవారం నామినేషన్ ను ప్రతిపాదించారు. శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీకి బీజేపీ అభ్యర్థి ముర్ము నామినేషన్ పత్రాలను సమర్పించగా ఆదివాసి ఎంపీగా గెలిచిన సోయం బాపురావ్ కు ప్రతిపాదించే జాబితాలో చోటు దక్కింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి ఎంపీ సోయం అభినందనలు తెలిపారు. అదేవిధంగా అక్కడికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లను ఎంపీ సోయం మర్యాదపూర్వకంగా కలిసి నమస్కరించారు. తనకు బీజేపీ కేంద్ర నాయకత్వం నామినేషన్ పత్రాలపై ప్రతిపాదిత జాబితాలో అవకాశం కల్పించినందుకు ఎంపీ సోయం బాబూరావు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement