Sunday, May 19, 2024

రెడ్డి సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తా : మంత్రి కేటీఆర్

రెడ్డి సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామ‌ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఈ నెల 28 నుంచి రైతుబంధు రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంద‌న్నారు. సిరిసిల్ల జిల్లాలో భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయ‌న్నారు. సిరిసిల్ల‌లో మెడిక‌ల్ కాలేజీ నిర్మించుకోబోతున్నామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న రెడ్డీలు పేరుకే అగ్ర‌వ‌ర్ణాలు.. వీరిలో కూడా చాలా మంది నిరుపేద‌లున్నార‌న్నారు. రెడ్డి కార్పొరేష‌న్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం వెల్ల‌డిస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌తి కులంలో పేద‌వారు ఉన్నారని.. అలానే రెడ్ల‌ల్లో కూడా పేద‌లున్నార‌ని తెలిపారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో కుల‌మ‌తాలు ఏవైన‌ప్ప‌టికీ.. పేద‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య భార‌త‌దేశంలో జ‌ర‌గ‌ని అభివృద్ధి ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సాధ్య‌మైంద‌న్నారు. కేసీఆర్ రైతుబిడ్డ కాబ‌ట్టే రైతుల సంక్షేమం కోసం పాటుప‌డుతున్నార‌ని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement