Tuesday, April 30, 2024

పేరుకే జొన్న కొనుగోళ్లు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్

భారతీయ జనతా పార్టీ నాయకుల ఆందోళనతో దిగివచ్చి జొన్న కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామంటూ తెరాస నాయకులు ప్రగల్భాలు పలికి స్థానిక ఎమ్మెల్యే పత్రికలకు సోషల్ మిడియకు పోజులిచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండల కేంద్రాల్లోని మార్కెట్ యార్డులో నిన్న నామమాత్రంగా జొన్న కొనుగోళ్లు ప్రారంభించినట్టు ప్రకటించి.. ఈ రోజు కొనకుండా చేతులెత్తేసారన్నారు. జైనద్ మండల మార్కెట్ యార్డుకు చేరుకొని అధికారులను నిలదీయడంతో కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు. రాందాస్ ,రాకేష్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి,ముకుంద్ రావు. రైతుల బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement