Saturday, April 27, 2024

సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

ఏపీ సీఎం జగన్‌కు గురువారం నాడు వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు. వృద్ధాప్య ఫించన్‌లను ఈనెల నుంచి రూ.2,750కు పెంచి ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ఫించన్‌ను కూడా కలిపి రూ.3వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం వృద్ధాప్య ఫించన్‌ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ హామీకి ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించిందని ఎంపీ తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు రూ.250 మాత్రమే పెంచారని.. వృద్ధులు అంటే దైవంతో సమానమని, వారికి న్యాయం చేయాలని లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement