Wednesday, May 22, 2024

Delhi: ప్రెస్​ కౌన్సిల్​ సభ్యత్వానికి ఎంపీ కేకే రాజీనామా.. కేంద్రం వైఖరిపై అసంతృప్తి!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రంలో ఎలాంటి కారణాలు చూపనప్పటికీ మీడియా, పౌరుల వాక్ స్వాతంత్ర్యంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నియంతృత్వ వైఖరికి నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కేకే గతంలోనూ 2006 – 2011 వరకు పీసీఐ సభ్యులుగా వ్యవహరించారు. ఆ సమయంలో పెయిడ్ న్యూస్‌పై ఆయన అధ్యయనం చేసి రిపోర్ట్ సమర్పించారు. తన స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్‌కు ముందే తెలిపిన‌ట్లు కేకే పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement