Saturday, April 27, 2024

MP Suicide : టికెట్ ఇవ్వలేదని మనస్తాపంతో.. ఎంపీ ఆత్మహత్య

సిట్టింగ్ లోక్​సభ ఎంపీ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో తమిళనాడులోని డీఎండీకే పార్టీ ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ గణేశమూర్తి (77) కన్నుమూశారు. పురుగుమందు తాగి ఆదివారం (మార్చి 24న) ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు.

చికిత్స పొందుతున్న గణేశమూర్తికి ఇవాళ ఉదయం హార్ట్ ఎటాక్ రావడం వల్ల మరణించారని ఆస్పత్రి ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎండీకే తరఫున ఈరోడ్ నుంచి గణేశమూర్తి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కూడా పోటీ చేయాలనుకున్న గణేశమూర్తికి డీఎండీకే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement