Saturday, April 27, 2024

TS: బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాహాల్ బిస్కెట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంటలు అలుముకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున పాహాల్ కంపెనీకీ చెందిన బిల్డింగ్ లోని టాప్ ఫ్లోర్ లో మంటలు అంటుకున్నాయి. దీంతో ఫైర్ స్టేషన్ కు కాల్ చేసింది సిబ్బంది.

ఈ ప్రమాదం జరిగినప్పుడు వంద మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు సమాచారం. టాప్‌ఫ్లోర్‌లో ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుందంటున్నారు కంపెనీ యజమాని. అగ్నిమాపక సిబ్బంది మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనేది చెక్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement