Saturday, April 27, 2024

న‌ష్ట‌పోయిన పంట‌కి పరిహారం అందిస్తాం..ఎమ్మెల్యే కొండేటి..

అంబాజీపేట, ప్రభ న్యూస్ : తుఫాన్,వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగిన వరి చేలను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు.మండలంలోని ఇసుకపూడి, చిరతపూడి గ్రామాలలో ఎమ్మెల్యే చిట్టిబాబు పర్యటించి నష్టపోయిన వరి రైతుల నుండి వివరాలు తెలుసుకుని, వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎమ్మెల్యే వెంట మండల వ్యవసాయాధికారి సిహెచ్.డి.విజయకుమార్, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి,రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పేరి శ్రీను,వైకాపా మండల అధ్యక్ష ,కార్యదర్శి లు వాసంశెట్టి చినబాబు, నాగవరపు నాగరాజు ,స్థానిక సర్పంచ్ లు తరపట్ల మోహన్ సింగ్, కోట బేబీ రాణి, వైస్ ఎంపీపీ నేతల నాగరాజు, ఇసుకపూడి ఎంపీటీసీ ముత్తాబత్తుల ప్రశాంత్ స్థానిక నాయకులు దొమ్మేటి సత్య మోహన్, రాయుడు కృష్ణ మహేష్, బొంతు శ్రీను, రైతులు, అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement